
BHAGAVATHAM - PILLALA BOMMALA
₹100
Currently out of stock
PublisherSWATHI BOOK HOUSE
LanguageTelugu
ISBN9789384812027
పరీక్షిత్తు కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులలో పెద్దవాడు ధర్మరాజు రాజయ్యాడు. అన్నదమ్ములు రాజ్యపాలనం చక్కగా చేసారు. ఆ తర్వాత అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు రాజ్యానికి వచ్చాడు. అతడు మేనమామ ఉత్తరుని కుమార్తె ఇంద్రావతిని వివాహమాడాడు. కాలధర్మంగా పాండవులు మరణించారు. పరీక్షిత్తు ధర్మరాజు మనుమనిగా ధర్మప్రభువని పేరు తెచ్చుకున్నాడు. ప్రజలు మెచ్చిన ప్రభువుగా పేరుపొందాడు. అతని పాలనలో అకాల వర్షాలు లేవు. కరువుకాటకాలు, ఆకస్మిక మరణాలు లేవు. ప్రజలు సుఖశాంతులతో బ్రతుకుతున్నారు. అటువంటి రోజులలో ఒకనాడు పరీక్షిత్తు వేటకు వెళ్ళాడు. క్రూరజంతువులను వధించి, అలసిపోయాడు. దీనికి తోడు దాహం వెయ్యసాగింది. చుట్టుప్రక్కల నీళ్ళున్న