
CHARITRAMAKA RAITHU RAKSHANA YATRA
₹100
In stock · 2 available
PublisherEMESCO BOOKS PVT.LTD
LanguageTelugu
చరిత్రాత్మక రైతు రక్షణ యాత్ర 1937-1938 నేడు రైతాంగ పరిస్థితులు ఆశాజనకంగా లేవు. వ్యవసాయం 'దండగ' అనే స్థితి దాపురించి, రైతులు, వ్యవసాయ కూలీలు, పట్టణాలకు వలసపోవడంతో, వ్యవసాయరంగం మరింత సంక్షోభంలో పడింది. దానికితోడు ప్రస్తుతం కేంద్రంలోని ప్రభుత్వం అన్నదాతలను కార్పోరేట్ల దయాదాక్షిణ్యాలకు గురిచేసే చట్టాలు తేవడం గమనిస్తున్నాం. ఒకప్పుడు అత్యంత సంఘటితంగా, క్రియాశీలకంగా పనిచేసిన రైతు సంఘాలు, యితర ప్రజా సంఘాలతో పాటు నీరసపడ్డాయి. వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులు తిరిగి జవసత్వాలను పుంజుకొని రైతాంగాన్ని ఆదుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్న అవసరాన్ని గుర్తుచేయడానికే యీ గ్రంథ పునర్ముద్రణ. ఎమెస్కోబుక్స్