
CLASS ROOMLO - 40
₹40
In stock · 699 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
తెలివి వచ్చింది అనేక విషయాలు తెలిసిన సద్ధర్ముడు అనే యోగి శివపురం వచ్చాడు అక్కడి జమీందారు కోటయ్యగారి ఇంటివద్ద బస చేశాడు ఈ వార్త తెలిసిన అనేకమంది రోజూ ఉదయం మధ్యాహ్నం జమీందారు భవంతికి వచ్చి ఆ యోగి చెప్పే విషయాలు తెలుసుకునేవారు. ఆ విషయాలు వింటే జీవిత విషయాలలో తెలివి వస్తుందని అందరూ గ్రహించి తమ కుటుంబంలోని వ్యక్తులను కూడా పంపేవారు. యోగి సద్ధర్ముడికి కావలసిన ఏర్పాట్లన్నీ కోటయ్యగారి గుమాస్తా సుందరం చూచేవాడు. ఒకనాడు కొందరు యువకులకు, యోగి చెప్పే విషయాలు ప్రత్యేకంగా వినిపించాలనే ఆలోచన జమీందారుకు వచ్చింది. ఆ రోజు శనివారం. యువకులందరితో పాటు తన కొడుకు పద్మనాభాన్ని కూడా యోగికి పరిచయం చేసి సుందరం పనిమీద ఎటో వెళ్ళిపోయాడు ఆ రాత్రి సద్ధర్ముని కలిసినప్పుడు, “స్వామీ... నా కుమారుని మీరు చూశారు కదా...” అన్నాడు సుందరం.