DHEERA TELANGANA SAYUDHA PORATABHATA by VYASA SANKALANAM Telugu book cover

DHEERA TELANGANA SAYUDHA PORATABHATA

by VYASA SANKALANAM

₹60
In stock · 61 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
అప్పటికే దేశవ్యాపితంగా స్వాతంత్య్ర పోరాటం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో బ్రిటీష్ ప్రభుత్వం ప్రజల సహాయ నిరాకరణ తిరుగుబాటుతో ఉక్కిరిబిక్కిరై దేశానికి స్వాతంత్య్రం ప్రకటించి వెళ్లిపోవాలని నిర్ణయించుకొని, హిందూ, ముస్లింలమధ్య చిచ్చుపెట్టి భారత్, పాకిస్తాన్లుగా విడగొట్టింది. దేశంలోని సంస్థానాలు తమ ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకోవచ్చని ప్రకటించింది. దీనితో నిజాం నవాబుకు మరింత బలం చేకూరింది. 1947 జూన్లోనే హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్రదేశంగా ప్రకటించుకున్నాడు. ఆగష్టు 15 1947న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. నిజాం నవాబు విలీనం చేయడానికి నిరాకరించడంతో ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టుపార్టీ, ట్రేడ్ యూనియన్లు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మబ్లూం మొహినూద్దీన్ పేరుతో నిజాంను గద్దెదించెందుకు సంఘాలు పెట్టుకొని సంఘటితం కావాలని, వేరే మార్గం లేదని సెప్టెంబర్ 11న నిజాం నవాబు రాజ్యాన్ని సాయుధ పోరాటం ద్వారానే అంతం చేయాలని పిలుపిచ్చారు. ఆ పిలుపు ప్రభంజనమైంది. ఊరు, వాడ ఉప్పెనై కదిలింది. భూములు ఆక్రమించే పోరాటం ఉదృతమైంది. అయ్యా నీబాంచెను అనే చేతులే, బందూకులు పట్టాయి. దొరల కబందహస్తాల క్రింద నలిగిన మహిళలంతా వడిసెల్లు, కారంపొడి, కర్రలు పట్టారు. తెలంగాణమంత రణరంగంగా మారింది. ఆనాటి హోంశాఖామాత్యులు వల్లభాయ్పటేల్ ఆదేశాలతో యూనియన్ సైన్యాలు హైదరాబాద్కు సెప్టెంబర్ 13న చేరుకోవడం, ఎలాంటి రక్తపాతం లేకుండా 17 సెప్టెంబర్న నిజాం సైన్యాలు యూనియన్కి లొంగిపోవడం, నిజాం నవాబు తెలంగాణ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడంతో రాచరికవ్యవస్థ అంతమైపోయింది. అప్పటికే తెలంగాణలో దాదాపు 4000 మంది విప్లవ యువకిషోరాలు పోరాటంలో అశువులు బాసారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్